కీసర, ఆగస్టు 16: రెండో శ్రావణ మాసం సందర్భంగా సోమవారం కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా శివభక్తులు కీసరగుట్టకు విచ్చేసి గర్భాలయంలో పంచామృతాలతో స్వామికి ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అనంతరం వేదపండితులు స్వామిని పల్లకిసేవలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ తెలిపారు. కార్యక్రమంలో వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.