కీసర, మే 28: ప్రజలకు నిత్యావసరాలు చేరవేస్తున్న సేవకులందరికీ కరోనా వ్యాక్సిన్ను వేస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను శుక్రవారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సెంటర్లో మీడియాకు చెందిన వారు 21మంది, గ్యాస్ ఏజెన్సీలో పనిచేసేవారు 50, పెట్రోల్ బంక్లో పనిచేసేవారు 11మంది, మొత్తం 83 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిగా కరోనా నిర్మూలన కావాలంటే అన్ని వర్గాల వారికి టీకా వేయించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించడానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, సర్పంచ్ మాధురి , మండల అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, నాయకులు వెంకటేశ్ ముదిరాజ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.