కీసర, మార్చి 14 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధి గోధుమకుంట గ్రామానికి చెందిన మంచాల యాదగిరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.60వేల రూపాయల చెక్ను సోమవారం మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరవాతనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని స్కీంలను అందిస్తున్నామన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఈ పథకానికి అర్హులైన వారందరికి అందిస్తున్నామన్నారు. మేడ్చల్ జిల్లాల్లో దరఖాస్తు చేసుకొన్నవారందరికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించామన్నారు.
గ్రామాల్లోని సర్పంచ్లు, ఎంపీటీసీలు,పంచాయతీ సభ్యులందరు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చీర కృష్ణ, మేడ్చల్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు చీర సురేశ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.