కీసర : అక్రమంగా నిల్వచేసిన బయో డీజిల్ కేంద్రంపై పోలీసులు దాడి చేసి.. యజమానిని అదుపులోకి తీసుకున్నారు. 30వేల లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. రాంపల్లిదాయరలోని నిర్మానుష్య ప్రాంతంలో శ్రీనిధి ఎంటర్ప్రైజెస్ కంపెనీతో ఒప్పందం చేసుకొన్న గిరిధర్ అనే వ్యక్తి డీజిల్ దొంగతనాలకు పాల్పడి అక్రమంగా నిల్వచేసి అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న సీఐ నరేందర్గౌడ్, పోలీసులు శుక్రవారం ఆ బయో డీజిల్ కేంద్రంపై దాడి చేశారు. యజమానిని అదుపులోకి తీసుకుని.. 30వేల లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకొన్నారు. సమాచారం అందుకున్న డీసీపీ రక్షితమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.