మేడ్చల్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరల పంపిణీకి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 7,04,669 లబ్ధిదారులకు.. 635 రేషన్షాపుల ద్వారా.. వినాయక చవితి పండగ అనంతరం చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. తెలుపు రేషన్ కార్డులు ఉండి..18 సంవత్సరాలు పైబడి ఉన్న వారందరికీ చీరలు అందించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 30న బతుకమ్మ చీరలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ విడుదల చేసి..చీరల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. వచ్చిన బతుకమ్మ చీరలను మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జీహెచ్ంఎసీ సర్కిళ్లకు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలకు సరఫరా చేస్తున్నారు.