మల్లాపూర్, మే 14: సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది మహా త్మా బసవేశ్వరుడని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లో వీరశైవ సమాజం కాప్రా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్ధానిక కార్పొరేటర్ ప్రభుదాస్తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై బసవేశ్వర విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్రెడ్డి, గరిక సుధాకర్, బాజీ పాషా, చంద్రశేఖర్గౌడ్, సాయికుమార్, సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్, మే 14: విశ్వగురువు బసవేశ్వరుడి జయంతిని రామంతాపూర్లో వీరశైవ లింగాయత్లు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిలో ఉన్న బవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వీర శైవలింగాయత్ అధ్యక్షుడు కోట గుండప్ప, ఉపాధ్యక్షులు సంకూరి కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా విశ్వగురు బసవేశ్వరుని జయంతి నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కంట్ల శివకుమార్, ఉమాశంకర్, శ్రీనివాస్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.