మేడ్చల్, జూన్ 4 : కరోనా పరీక్షలు వేగవంతంగా చేయాలని ప్రజలకు చేరువలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరీక్ష కేంద్రాలను ప్రారంభించారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని హెల్త్ సబ్ సెంటర్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని 23 వార్డు కౌన్సిలర్ కౌడే మహేశ్ ప్రారంభించారు.
కీసర, జూన్ 4 : కీసర మండలంలోని భోగారం, చీర్యాల్లోని హెల్త్ సబ్సెంటర్లో కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, కీసర ఎంపీడీవో పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా కేసులు తగ్గించడానికి ఏకంగా హెల్త్ సబ్సెంటర్లో కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు తుంగ ధర్మేందర్, సుంకరి కవితాజైహింద్రెడ్డి, ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకట్రెడ్డి, కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సరిత పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 4 : కరోనా లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. నాగారంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని చైర్మన్ ప్రారంభించారు. దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్-19 పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు వాణి రెడ్డి, స్వామి, టీఆర్ఎస్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, నాయకులు కె.దయాకర్ రావు, జలీల్ షాఫా, తదితరులు పాల్గొన్నారు.