మేడ్చల్ కలెక్టరేట్, జూలై 19 : కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు.మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు సత్యనారాయణ కాలనీ, భాగ్యనగర్, రవీంద్ర నగర్, ఎస్సీ కాలనీల్లో చైర్మన్ సోమవారం పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాలనీలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, నాయకులు అన్నంరాజు శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు శ్రీనివాస్ నగర్ కాలనీలో అన్నంరాజు రాజయ్య, కాడయ్య, వెంకటస్వామి సోదరుల ఆర్థిక సహాయంతో నిర్మించిన పోచమ్మ ఆలయ ముఖద్వారాన్ని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆలయ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్లు లావణ్య , సుమిత్ర సురేశ్,బి.శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.