HomeRangareddyMd Raghumareddy Said That Kites Should Be Flown In Plains
మైదానాల్లోనే ఎగురవేయాలి
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు.
టీఎస్ ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ రఘుమారెడ్డి
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. అయితే ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పండగను ఆనందంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) చైర్మన్, ఎండీ జి.రఘుమారెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
విద్యుత్ స్తంభా లు, తీగలు ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట, బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి.
విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దు.
పిల్లలు, యువకులు విద్యుత్ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసేందుకు ప్రయత్నించ వద్దు.
కాటన్, నైలాన్, లినెన్తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు.
భవనాల మీద నుంచి, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు.
అత్యవసర పరిస్థితుల్లో 1912కు లేదా సమీపంలో ఉన్న విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.