బడంగ్పేట, ఫిబ్రవరి 3: మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అన్నీ తానై లాలిస్తున్నాడు. కావాల్సిన సపర్యలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవో భవ అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు గిరి. అనాథలు, మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 112 మందికి మాతృదేవోభవ ఆశ్రమం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాడు. తన భార్య ఇందిర, మరో ముగ్గురితో కలిసి వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ప్రతి నెలా వైద్య సేవలు అందించడంతో పాటు ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే దహన సంస్కారాలు చేస్తున్నాడు.
53 మందికి దహన సంస్కారాలు..
మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న రవి ఆశ్రమంలో మరణించిన అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు. ఇందుకయ్యే ఖర్చును తానే భరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆశ్రమంలో చనిపోయిన 11 మందితోపాటు.. మరో 42 మందికి దహన సంస్కారాలు చేశాడు. ఏ మతం వారైతే ఆ మత సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు అక్కడ నిర్వహిస్తున్నారు.
సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది..
అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నా. వారు మరణించిన తర్వాత అనాథ అన్న భావన తొలిగించేందుకు నేనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నా. వారి అస్థికలను గంగా, కృష్ణా నదుల్లో కలుపుతున్నా. ఇప్పటి వరకు ఆశ్రమంలోని 11, బయటి వారు 42 మందికి దహన సంస్కారాలు చేశా. ఒక్కొక్కరి దహన సంస్కారాలకు రూ.8 వేలు ఖర్చు అవుతున్నది. అనాథలకు సేవ చేసే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా.
– రవి , మాతృదేవో భవ ఆశ్రమ నిర్వాహకుడు