షాబాద్, డిసెంబర్ 2: మొక్కజొన్నలకు ఈ ఏడాది మార్కెట్లో మద్దతుకు మించి ధర పలుకుతున్నది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ. 1,960 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో రూ.2,200 ధర పలుకుతున్నది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యా పారులు చెబుతున్నారు. రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది 70,332 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఎకరానికి 30 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా, అకాల వర్షాలతో 20 క్వింటాళ్ల వర కు మాత్రమే దిగుబడి వస్తున్నది. దిగుబడి తగ్గినా మా ర్కెట్లో ధర కలిసొస్తుండటంతో రైతులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. దీంతోపాటు మొక్కజొన్నలను బ్రాయిలర్, లేయర్ కోళ్ల పరిశ్రమలు, బిస్కెట్ల తయారీకి వినియోగిస్తుండటంతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న కారణంగా ధర పెరుగుతున్నదని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే మార్కెట్లో ధర అధికంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
70,332 ఎకరాల్లో మొక్కజొన్న సాగు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజవర్గాల పరిధిలోని 25 మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఈ ఏడాది వానకాలం సీజన్కు సం బంధించి రైతులు 70,332 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా దిగుబడులపై ప్రభావం పడింది. వానకాలంలో మొక్కజొన్న ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాల్సి ఉం డగా కేవలం 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. అయితే దిగుబడి తగ్గి నా మార్కెట్లో ధర రూపంలో రైతుకు కలిసొస్తున్నది. మద్దతుకు మించి ధర పలుకుతుండటంతో రైతులకు లబ్ధి చేకూరనున్నది. వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి మొక్కజొన్నలను మద్దతు ధర కంటే అధికంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపకుండా, బయటి మార్కెట్లో పంటను విక్రయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.1,960
కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గాను మొక్కజొన్నకు క్వింటాల్కు రూ.1,960 మద్దతు ధర ను ప్రకటించింది. కాగా బయటి మార్కెట్లో మద్దతు ధరకు మించి రూ. 300 వరకు అధికంగా ధర పలుకుతున్నది. పౌల్ట్రీఫాం యజమానులు, ఇతర వ్యాపారులు నేరుగా రైతుల పొలాల్లోని కల్లాల వద్దకే వచ్చి రూ.2,200 నుంచి రూ. 2,300 వరకు పంటను కొంటున్నారు. మొక్కజొన్నల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది.
40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది
నేను రెండు ఎకరాల పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశా. ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉం డగా, భారీ వర్షాలతో పంట కొంత దెబ్బతిన్నది. దీంతో ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున మొత్తం 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కేంద్ర ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 1,960 కంటే అధికంగా బయటి మార్కెట్లో ధర పలుకుతుండటం తో క్వింటాల్కు రూ.2,200కు జొన్నలను విక్రయిం చా. దిగుబడి తక్కువగా వచ్చినా ధర మంచిగా ఉండడంతో రైతుకు కలిసొస్తున్నది.
-అంజయ్య, రైతు కుమ్మరిగూడ(షాబాద్)