తలకొండపల్లి, ఫిబ్రవరి 21 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, మాడ్గుల మండలంలోని గుడితండాకు చెందిన వార్డు సభ్యులు బంకట్లాల్, రమావత్ పంతూనాయక్, పుల్సింగ్నాయక్తో పాటు పలువురు గిరిజనులు ఎమ్మెల్యే సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం తగిన నిధులు ఇస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను నిలిపివేయలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలం బిస్తున్నదన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధ్ది కోసమే ఆరాట పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శంకర్నాయక్, సర్పంచ్ రమేశ్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు విజయ్కుమార్రెడ్డి, మాజీ సర్పంచ్ పవన్కుమార్రెడ్డి, బాలు, రాజు, నర్సింహ, గోపాల్, మంద వీరయ్య, మంద లక్ష్మయ్య, బైరపాక మహేశ్, ముదిగొండ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.