ఆమనగల్లు, జనవరి 8 : చెంచు జాతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ్ అభియాన్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మండల వ్యవసాయ శాఖ అధికారిణి అరుణకుమారి అన్నారు. ఈ పథకంలో 11 రకాల ముఖ్యమైన సౌకర్యాలు పొందొచ్చన్నారు.
అందులో భాగంగా సోమవారం ఆమనగల్లు రెవెన్యూ పరిధిలోని శంకర్కొం డతండా, ఆమనగల్లుకు చెందిన చెంచు రైతులతో అరుణకుమారి సమావేశమై రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా, పీఎం కిసాన్ సమ్మాన్నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు లాంటి ఇతర పథకాలు అందాలంటే ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఉండాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కో-ఆర్డినేటర్ నయీముద్దీన్, వ్యవసాయ విస్తరణ అధికారి శివతేజ, ప్రభుత్వ దవాఖాన మెడికల్ అధికారి పరీక్షిత్, ఎంపీహెచ్వో తిరుపతిరెడ్డి, ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ శంకర్, చెంచు సంఘం నాయకుడు జంగయ్య పాల్గొన్నారు.