రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు
సర్దార్నగర్, కక్కులూర్ పాఠశాలలను సందర్శించిన డీఈవో
షాబాద్, జూన్ 28 : మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. అనంతరం మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని సూచించారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. బడి బాటతో ఎంతమంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారని ఉపాధ్యాయులను ఆరా తీశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్రాథోడ్, సర్పంచులు భానూరి మమతారెడ్డి, స్వరూప, మాజీ ఎంపీటీసీ జీవన్రెడ్డి, నర్సింహులు, ఉపాధ్యాయులు ఉన్నారు.