కడ్తాల్ : విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని టాక్రాజ్గూడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టాక్రాజ్గూడ తండాకి చెందిన విస్లావత్ దీప్లానాయక్ ఆదివారం ఉదయం స్నానం చేసి, ఉతికిన బట్టలను ఇంట్లోనే ఉన్నతీగపై ఆరవేయడానికి వెళ్లాడు. బట్టలు ఆరబెట్టే తీగకు అంతకుముందే విద్యుత్ వైర్ తెగిపోయి దానికి తగిలి ఉండటంతో ప్రమాదవశాత్తు దీప్లానాయక్ విద్యుత్ షాక్కి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తండాకి చేరుకోని, దీప్లానాయక్ మృతదేహంపై పూలు ఉంచి నివాళులర్పించారు.
అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, జడ్పీటీసీ దశరథ్నాయక్ సమకూర్చిన రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరుపును ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పరామర్శించిన వారిలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ హరిచంద్నాయక్, ఉప సర్పంచ్ జగన్నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, నాయకులు రాములునాయక్, బలరాంనాయక్, భాస్కర్ పాల్గొన్నారు.