షాబాద్ : షాబాద్ మండలంలోని మల్లారెడ్డిగూడ గ్రామంలో ఆదివారం మల్లన్న బోనాలు వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది శ్రావణమాసంలో జరిగే బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులంతా గ్రామంలోని మల్లన్న దేవాలయానికి బోనాలతో వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు, చిన్నారులు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకుని మల్లన్న దేవాలయంకు చేరుకుని బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగయ్య, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, మాజీ సర్పంచ్ గణేశ్గౌడ్, ఉప సర్పంచ్ వెంకటయ్య, గ్రామ పెద్దలు ఉన్నారు.