అభివృద్ధి పథంలో మల్కీజ్గూడ
గ్రామ రూపురేఖలు మార్చిన ‘పల్లె ప్రగతి’
ప్రతిరోజూ పారిశుధ్య పనుల నిర్వహణ
అద్దంలా మెరుస్తున్న పల్లెలోని రోడ్లు
వెల్లివిరుస్తున్న పచ్చదనం, పరిశుభ్రత
వైకుంఠధామం, కంపోస్టుయార్డుల నిర్మాణం పూర్తి
స్థానికుల హర్షం
యాచారం, జూలై 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని మల్కీజ్గూడ గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ఊరిలో ఎక్కడచూసినా పచ్చదనం, శుభ్రతతో కళకళలాడుతున్నది. ఇప్పటికే పల్లెప్రకృతివనం, కంపోస్టు యార్డు, వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి.. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఆ ఎరువును పల్లెప్రకృతివనంలోని మొక్కలకు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నది. గ్రామం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణంతో అద్దంలా మెరుస్తున్నది. గ్రామాభివృద్ధికి సర్పంచ్ చీర యాదమ్మ, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, పాలకమండలి సభ్యులతోపాటు అధికారులు సహకరిస్తున్నారు.
పచ్చదనాన్ని పెంపొందిస్తున్న పల్లె ప్రకృతివనం
గ్రామంలోని పల్లెప్రకృతివనంలో 1510 మొక్కలను పెంచుతున్నారు. అందులో వివిధ రకాల పండ్లు, పూలు, డిజైన్ మొక్కలున్నాయి. ప్రతిరోజూ పంచాయతీ ట్యాంకర్ సహకారంతో వనసంరక్షకులు నీరుపోసి సంరక్షిస్తున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 1800 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ప్రతిరోజూ మొక్కల కు నీటిని అందిస్తున్నారు.
రూ. 2.50 లక్షలతో కంపోస్టు యార్డు..
ఉపాధి హామీ నిధులు రూ.2.50 లక్షలతో గ్రామంలో కం పోస్టు యార్డును నిర్మించారు. ఇందులో గ్రామంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తాచెదారాన్ని వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ సేకరిస్తున్న చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను డంపింగ్ యార్డు వద్ద తగులబెడుతున్నారు.
రూ.12.50 లక్షలతో వైకుంఠధామ నిర్మాణం
గ్రామంలోని వైకుంఠధామాన్ని ఉపాధి హామీ నిధు లు రూ.12.50 లక్షలతో నిర్మించారు. అందులో రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, బాత్రూంలు, ముఖద్వారాలను ఇప్పటికే నిర్మించారు. గ్రామంలో ఎవరూ మృతి చెందిన ఒకేచోట దహన సంస్కారాలు చేసేందుకు సకల వసతులను కల్పించారు. గతంలో సరిపడా స్థలం లేక, వసతుల్లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు..
ఊరిలోని ఇంటింటికీ శుద్ధి చేసిన మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు 440 నల్లాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామంలో రెండు ట్యాంకులను నిర్మించారు. దీంతో ప్రతిరోజూ సరిపడా శుద్ధి చేసి న తాగునీరు అందుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు
పల్లెప్రగతి ద్వారా గ్రామంలో 54 పాడుబడిన పాత ఇండ్లను కూల్చివేశారు. రూ.9.45 లక్షలతో ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. గ్రామంలో 21 సీసీ రోడ్లు, 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తైంది. అదేవిధంగా 28 భూగర్భ డ్రైనేజీ, 440 మిషన్ భగీరథ నల్లాల బిగింపు పనుల పూర్తితోపాటు రూ. 12.50లక్షలతో వైకుంఠధామం, రూ.2.50లక్షలతో కంపోస్టుయార్డును నిర్మించారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ..
గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. ‘పల్లె ప్రగతి’తో గత రెండేండ్లుగా గ్రామం అనేక రం గాల్లో అభివృద్ధి చెందినది. విద్యుత్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు వంటి తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఇప్పటికే వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, కంపో స్టు యార్డు, డంపింగ్ యార్డు, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను పూర్తి చేశాం.
–చీర యాదమ్మ, సర్పంచ్ మల్కీజ్గూడ
స్థానికులు సహకరిస్తున్నారు..
గ్రామాభివృద్ధికి స్థానికుల సహకారం మరువలేనిది. ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు చెత్తాచెదారాన్ని తొలగిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. ప్రభుత్వ నిధులతో ట్రాక్టర్, ట్యాంకర్ను కొనుగోలు చేశాం. వాటి ద్వారా పల్లెప్రకృతివనం, నర్సరీల్లోని మొక్కలను నీటిని అందిస్తున్నాం. స్థానికులు సమస్యల ను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తా.
–వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మల్కీజ్గూడ
పల్లె ప్రగతితో అభివృద్ధి పథంలో..
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృ ద్ధి చెందినది. గతంలో అధ్వానంగా ఉన్న గ్రామంలో పల్లెప్ర గతి కార్యక్రమంతో పరిశుభ్ర త, పచ్చదనంలో మెరుగుపడినది. గ్రామంలో అన్ని రకాల వసతులను ప్రభు త్వం కల్పిస్తున్నది. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
–డేరంగుల శారద, ఎంపీటీసీ మల్కీజ్గూడ