సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పోలీసులు నిఘా పెంచి, అనుమానితులను ముమ్మరంగా తనిఖీలు చేస్తుండడంతో గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ సరికొత్త తరహాలో ఏపీ నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు మత్తు పదార్థ్ధాలను రవాణా చేస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరం తో పైలెట్ వాహనం వెళ్తుంటే వెనుక నుంచి ముఠా సభ్యు లు గంజాయితో వస్తుంటారు. స్మగ్లర్ల ఎత్తును పసిగట్టిన రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రెండు వేర్వే రు గ్యాంగ్లను వెంటాడి పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో రూ.1.15 కోట్ల విలువైన 380 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సం బంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సోమవారం ఎల్బీనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
చౌటుప్పలో…
మహబూబాబాద్ జిల్లా, మోదులగూడెం గ్రామం, జుజు ర్ తండాకు చెందిన దరవాత్ పుల్సింగ్పై గతంలో మూ డు ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. దీంతో గంజా యి సరఫరాదారులతో మంచి లింక్లున్నాయి. ఈ క్రమంలోనే స్థానికులైన ఎండీ గౌస్పాషా, బూక్య బిక్షపతి, షేక్ మెహినుద్దీన్తో ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఏపీలోని సీలేర్లో ఉండే బాలు అలియాస్ బాలేశ్ను సంప్రదించి, మారుతీ స్విఫ్ట్ డిజైర్ (ఏపీ36ఏక్యూ5989), టాటా జెస్ట్ (టీఎస్28సి1468) కార్లలో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి 5వ తేదీ ఉదయం ఒక కారు ముందు పైలెట్గా, మరో కారు వెనక నుంచి వస్తున్నాయి, వీటి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లు ఉంది, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర సోలాపూర్లో లింబాజి అనే వ్యక్తికి ఈ గంజాయిని ఈ ముఠా సరఫరా చేసేందుకు వెళ్తున్నారు. ఎస్ఓటీ-1 మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రాములు బృందం ఈ ముఠాపై పక్కా సమాచారం అందుకొని నిఘా వేసింది. పైలెట్ కారుతో పాటు వెనుక సరుకుతో వస్తున్న కార్లను రెండింటిని ఒకేసారి పట్టుకొని అందులో ఉన్న 160 కిలోల గం జాయితో పాటు, ప్రధాన నిందితుడు పూల్సింగ్తో పాటు గౌస్, బిక్షపతి, మోహినుద్దీన్ను అరెస్ట్ చేశారు. సీలెరుకు చెందిన బాలేశ్తో పాటు మహారాష్ట్రలో లింబాజీలు పరారీలో ఉన్నారు.
యాచారంలో…
హైదరాబాద్ యాఖుత్పురాకు చెందిన మహ్మద్ ఫిరోజ్, కర్వాన్కు చెందిన దినేశ్ సింగ్ పాత నేరస్తులు. వీరిద్దరికీ ఏపీలోని సీలేరులో గంజాయి సరఫరా చేసే వాళ్లతో పరిచయాలుండడంతో హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ చేసి డబ్పు సంపాదించేందుకు ఫ్లాన్ చేశారు. ఇం దులో భాగంగా నగరానికి చెందిన మహ్మద్ ఖాదర్, అ బ్దుల్ రవైఫ్, సతీష్తో కలిసి ముఠాను ఏర్పాటు చేశారు. టాటా ఇన్నోవా(ఏపీ 29బీడీ 6599), హోండా సిటీ(ఏపీ 12ఈజీ 9756) కార్లలో అక్కడకు వెళ్లారు, అక్కడ ముకుంద్ అనే వ్యక్తి వద్ద నుంచి 220కిలోల గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి మహారాష్ట్రలోని బుల్దాన సిటీకి రెండు కార్లలో బయలుదేరారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో పైలెట్ వాహనాన్ని నడిపిస్తూ ఎప్పటికప్పుడు పోలీసుల తనిఖీలు, చెక్పోస్టుల వివరాలు చర్చించుకుంటూ వెళ్తున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై వస్తే పంతంగి టోల్గేట్ వద్ద రాచకొండ పోలీసుల తనిఖీలుంటాయని, ఆ తనిఖీలను తప్పించుకోవడానికి నాగార్జునసాగర్ రూట్లో హైదరాబాద్ వైపు వస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు యాచారం పోలీసుల సహకారంతో యాచరంలోని గుంగల్ క్రాస్రోడ్డులో ఈ రెండు వాహనాలను పట్టుకున్నారు. ఈ కేసులో సీలెర్కు చెందిన ముకుంద్, మహారాష్ట్రకు చెందిన ఠాకూర్ మినహా మిగతా ఐదు గురిని అరెస్ట్ చేశారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకీదరవాత్, మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, చౌటుప్పల్, యాచారం ఇన్స్పెక్టర్లు దేవెందర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.