చేవెళ్లటౌన్, మార్చి 1 : చేవెళ్లలోని హీరోహోండా రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి.. అందులో ఉన్న హీరోహోండాకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ దగ్ధమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని అన్ని ఆటోమొబైల్స్ షాప్లకు ఇక్కడి నుంచే స్పేర్ పార్టులను సరఫరా చేస్తారని.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.
రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంబవించలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజిన్తో మంటలు ఆర్పేలోపు సామగ్రి పూర్తిగా కాలిపోయి బూడిదైంది. రాత్రి పూట ఈ ప్రమాదం జరగడంతో పోలీసుల్లో అనుమానాలు రేకెతిస్తున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.