షాద్నగర్, జనవరి 27 : గ్రామాల దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. పల్లెల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని అభిప్రాయపడ్డారు.
మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తేనే ఆ గ్రామాలు అభివృద్ధి చెందు తాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మా ట్లాడుతూ పల్లెల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. పార్టీలకతీతంగా గ్రామాలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్నదన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్కుమార్, ఎంపీటీసీ మల్లేశ్, జడ్పీటీసీ విశాల తదితరులు పాల్గొన్నారు.