ఓంకారం ప్రతిధ్వనించగా.. శివనామం మార్మోగగా.. మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. భక్తుల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. శివాలయాలు భక్తజన ప్రవాహాన్ని తలపించాయి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. దీక్షలు, పుణ్య స్నానాలు, రు్రద్రాభిషేకాలతో భక్తులు నీలకంఠడిని పూజించారు. రాత్రంతా జాగారం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ