షాద్నగర్టౌన్ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ అన్నారు. షాద్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని కింగ్స్ప్యాలెస్లో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీఐ నవీన్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మనం చేసే రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కొల్పొతున్నారనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అదే విధంగా కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ప్రస్తుత సమయంలో రక్తం కోరతతో తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కొల్పోయే పరిస్థితి నెలకొంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు.
రక్తదానం చేయడం ద్వారా ఎలాంటి వ్యాధులు వ్యాపించవన్నారు. మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఆపద సమయాల్లో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందని, యువత రక్తదానం చేసేందుకు ముందుకురావాలన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారిని అభినంధించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు సురేశ్, సుందరయ్య, యువసత్తయూత్ అధ్యక్షుడు లక్ష్మణ్కుమార్, నాయకులు రమేశ్, సురేష్, యువకులు పాల్గొన్నారు.