కొడంగల్, జూలై 4: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ట్యాబ్లను పంపిణీ చేసింది. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మంగళవారం పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ పాఠాలు చెబుతుండగా శ్రద్ధగా వింటున్న విద్యార్థులు.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అందించిన ట్యాబ్ లతో విద్యార్థులకు బోధన ప్రారంభించినట్లు మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం క్రాంతికుమార్ తెలి పారు. నూతన బోధనా పద్ధతులను అవలంభించే విధంగా ప్రభుత్వ పాఠ శాలలకు ట్యాబ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ట్యాబ్లతో విద్యార్థు లకు శిక్షణ ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉందని, బొమ్మలను చూ పించి పాఠా లను బోధించడం వల్ల విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటా రన్నారు. పాఠాలు బోధించడం కూడా చాలా సులువుగా ఉందని, చదివిన దానికంటే చిత్రాలతో విద్యార్థులు త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు గుర్తిండిపో తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సంధ్యపాల్గొన్నారు.