ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లికి చెందిన వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులు, ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం, రాయపోల్ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. 50 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలు కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను వంచించడానికి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఆ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందే టికెట్ల కోసం పోటీపడుతున్నారని.. ఎన్నికలు ముగియగానే వారు మళ్లీ నగరంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండరని తెలిపారు. ఎన్నికలప్పుడే వచ్చేవారిని ప్రజలు నమ్మవద్దని కోరారు. నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికి,ఋ అభివృద్ధి నిరోధకుల మధ్య జరిగే ఎన్నికలని.. ప్రజలు ఆలోచించుకుని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీని మరోమారు గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, దండుమైలారం సహకార సంఘం వైస్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, సర్పంచ్ బల్వంత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి
కేశంపేట : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని పోమాల్పల్లికి చెందిన పలువురు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో పోలెపోగు శ్రీకాంత్, సాయి, శివశంకర్, మహేశ్, జంగయ్య, కాశన్న, చంద్రయ్య, రాజు, పెబ్బె రాజు, శ్రీశైలం, బాలయ్య, రామయ్య, పెంటయ్య, వెంకటయ్య, బాబయ్య, జనార్దన్, ప్రసాద్, సాయికుమార్, శ్రీను, రజనీకాంత్, ఎల్లయ్య, రాములమ్మ, మహేందర్, కామేశ్, రాజు, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాంబల్నాయక్, శేఖర్పంతులు, భూపాల్రెడ్డి, అంజయ్య, దశరథ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బొంరాస్పేటలో కారు జోరు
బొంరాస్పేట : బొంరాస్పేట మండలంలో కారు జోరు కొనసాగుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కారు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నది. అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీఆర్ఎస్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం మండలంలోని కూబ్యానాయక్తండాకు చెందిన రాజు, లాలు, మోహన్, భద్రు, తులసీరాం, బాబ్యా, రాజు, అనిల్, సంతోష్, లాలు, సూర్యా, రవి తదితరులు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వీరికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలువాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండతో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించామన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేశ్యానాయక్, దేవుజానాయక్, నర్సింహ రాథోడ్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు కొండంత అండగా..
షాద్నగర్రూరల్ : తెలంగాణ సర్కార్ వచ్చాకే మైనార్టీల సంక్షేమానికి కృషి చేయడంతో నేడు మైనార్టీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన యువ నేత తబ్రెజ్ ఆధ్వర్యంలో 50 మంది మైనార్టీలు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9 ఏండ్లలో కనీవిని ఎరుగని స్థాయిలో అభివృద్ధిని సాధించి దేశానికే దిక్సూచిలా మారిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ మిషన్ భగీరథ పథకంతో సురక్షిత మంచినీరు, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలోకి స్వచ్ఛందంగా మొగిలిగిద్ద మైనార్టీలు చేరడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.
గులాబీ జెండా నీడలో పని చేద్దాం
వికారాబాద్ : బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమవుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు దాదాపు 60 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషితో గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో దేశంలో నంబర్ వన్గా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇటువంటి పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు. గులాబీ జెండా నీడలో పని చేద్దామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, రాకేశ్, శ్రీకాంత్, రాజేందర్రెడ్డి, బుచ్చయ్య, రాములు, మాణిక్యం, పాండురంగారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.