అబ్దుల్లాపూర్మెట్, మార్చి 26 : మండలంలోని బాచారం గ్రామంలోని కొండపై కొలువైన జ్ఞానగిరి ఆలయ లక్ష్మీనరసింహస్వామి పన్నెండొవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు మంగళవారం ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, సేవాకాలం, ధ్వజారోహణం, దేవతాహ్వానం, అగ్నిప్రతిష్ఠ, ద్వారతోరణపూజ, చతుస్థానర్చన, పూర్ణాహుతి, తీర్థప్రసాదగోష్ఠి, సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, సుదర్శన ఇష్ఠి, పూర్ణాహుతి, శతుమురై, బలిహారణ జరిగాయి. 27న సుందరకాండ పారాయణం, కుంకుమార్చన, కుంబారాధన, చతుర్వేద పారాయణం, ఎదుర్కోలు ఉత్సవం, పూర్ణాహుతి, తీర్థగోష్ఠి, 28న అగ్ని ఆరాధన, మంగళస్నానం, నరసింహ ఇష్ఠి, పూర్ణాహుతి,
లక్ష పుష్పార్చన, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణోత్సవం, పూర్ణాహుతి, 29న రథోత్సవం, చతుస్థానార్చన, రథబలి, 30న అగ్ని ఆరాధన, స్వామివారి మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, నిత్యారాధన, శ్రీ పుష్పయాగం, ఏకాంత సేవ, ఆశీర్వచనం, కుంభప్రాక్షణ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని మాజీ సర్పంచ్ పారంద సంతోష, మాజీ ఉపసర్పంచ్ మోర ప్రభాకర్ముదిరాజ్, ఆలయ కమిటీ చైర్మన్ మోర నర్సింగ్రావు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.