చేవెళ్ల రూరల్, జనవరి 11: వర్షాకాలం పూర్తవడంతో రైతులు యాసంగి సాగులో బిజీ అయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాతలు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు అధిక శాతం తెల్ల కుసుమ పంటను సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పెట్టుబడి సాయాన్ని సకాలంలో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో వారు రెట్టింపు ఉత్సాహంతో పంటల సాగుకు సమాయత్తమయ్యారు. దీంతో ఎక్కడ చూసి నా గ్రామాలు పచ్చని పొలాలతో దర్శనమిస్తున్నాయి.
మండలంలో గతేడాది యాసంగి సాగు 7,848 ఎకరాల్లో…ఈ ఏడాది సాగు విస్తీర్ణం 8,120 ఎకరాలకు చేరింది. గతేడాదితో పోల్చితే 272 ఎకరాలు ఎక్కువగా సాగైంది. అందులో తెల్ల కుసుమ-2407 ఎకరాల్లో, శనగ- 804 ఎకరాల్లో, వరి- 203 ఎకరాల్లో మొక్కజొన్న-152, జొన్న 48, ఉద్యానవన విస్తీర్ణంతోపాటు మొత్తం 8,120 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
వ్యవసాయ అధికారుల సూచనలతో..
మండలంలోని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలను పాటిస్తూ పంటలను సాగు చేస్తున్నా రు. ఏఏ పంటలను సాగు చేయాలి.. ఎంత మొత్తంలో రసాయనిక మందులను వాడాలో తెలుసుకుంటూ పం టలను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
అధికంగా తెల్ల కుసుమల సాగు
యాసంగిలో రైతులు తెల్ల కుసుమ పంట సాగుకు అధికం గా మొగ్గు చూపుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులు దాదాపుగా 2,407 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉండటంతోపాటు ప్రభు త్వం సకాలంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో వారికి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గాలి.
– తులసి, మండల వ్యవసాయ శాఖ అధికారి