మండలంలోని బండవెల్కిచర్ల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత నీటితో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సోషల్మీడియాలో వార్తలు వైరల్ కావడం అంతా అవాస్తవమని.. అది ఫేక్న్యూస్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా, ట్విట్టర్లో వచ్చిన వార్తలకు స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్, పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని ఆ పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకుని.. విద్యార్థులకు మెరుగైన వైద్యమందేలా చూడాలని సూచించడంతో… గురువారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి, అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వి ద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ మొత్తం కలియతిరిగి, వసతులను పరిశీలించారు.
పాఠశాల ఆవరణ అంతా బాగానే ఉం దన్నారు. 10 నుంచి 12 మంది విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాగా వెంటనే పాఠశాల ప్రాం గణంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి వైద్యమందించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే కొన్ని మీడియా, సోషల్మీడియా సంస్థలు 120 మం ది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అస త్య ప్రచారం చేశాయన్నారు. ఇలాంటి వార్తలను ప్రచురించి విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనలకు గురిచేయొద్దని మీడియాకు సూచించారు. విద్యార్థులు తాగేందుకు మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని, ఇతర అవసరాల కోసం బోరు వాటర్ను వాడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపా రు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం అందించేందుకు వసతిగృహంలో హెల్త్వర్కర్ కూడా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు రాజకీయాలు తగవన్నారు. వసతి గృహంలో అన్ని వసతులున్నాయన్నారు.
కులకచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీ పాఠశాలలు, ఇతర వసతి గృహాలు కూడా సక్రమంగా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, ఎంపీటీసీ రాంలాల్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శేరిరాంరెడ్డి, చౌడాపూర్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాల్రెడ్డి, రాములు, లక్ష్మయ్య, తహసీల్దార్ రమేశ్, ఎంఈవో అబీబ్హైమద్, వైద్యాధికారి మురళీకృష్ణ, సీహెచ్వో చంద్రప్రకాశ్, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా గురువారం ఉదయం గిరిజన గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.