కొందుర్గు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు దరిగూడ మండలంలోని ఫీర్జాపూర్ గ్రామంలో సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేయడం వలన కాలనీలు సుందరంగా మారుతాయని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీలు ప్రతి రోజు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడం వలన గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్త చెదారం కనిపించడం లేదని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని ఇందులో భాగంగానే సీసీరోడ్ల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామాల్లో అనేక పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, శ్రీధర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూలయ్య, నాయకులు రాంచంద్రయ్య, మోత్యానాయక్, సికిందర్, రాములు, నర్సింహులు పాల్గొన్నారు.