కొడంగల్ : అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేయూతనందించడంతో పాటు వేడుకను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మతాలన్ని ఒక్కటేనని, ఏ గ్రంథమైనా కలిసి మెలసి సోదర భావంతో మెలగాలనే సూచిస్తాయన్నారు. కాబట్టే తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి వేడుకను ప్రభుత్వం తరపున జరిపిస్తుందన్నారు. అనంరతం ప్రత్యేక ప్రార్థనలతో పాటు కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, తాసిల్దార్ రవీందర్, బొంరాస్పేట వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, కౌన్సిలర్తో పాటు ఆయా మండలల చర్చీల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.