“రేవంత్.. దమ్ముంటే ముందు నాపై పోటీ చేసి గెలువు.. సీఎం కేసీఆర్కు నువ్వు అసలు పోటీనే కాదు.. ” అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి మాటలకు ఘాటుగా సమాధానమిచ్చారు. అప్పట్లో ఓటుకు నోట్లిస్తూ పట్టుబడ్డ రేవంత్.. ఇప్పుడు రూ.300 కోట్లతో పీసీపీ పదవిని కొనుక్కొని, సీట్ల అమ్మకంతో వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్కు పరిమితమై భూ కబ్జాలు, బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడిన రేవంత్కు 2018లో ప్రజలు ఘోర పరాజయాన్ని అందించి బుద్ధి చెప్పారన్నారు. మరోసారి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నమ్మిన వారికి సీట్లు కేటాయించకుండా డబ్బులు తీసుకొని సీట్లు కేటాయించడంతో సొంత పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ను ఛీ కొడుతున్నారన్నారు.
– కొడంగల్, అక్టోబర్ 25
కొడంగల్, అక్టోబర్ 25 : ‘నాతో పోటీ చేసే సత్తాలేదు కానీ సీఎం కేసీఆర్తో పోటీ నీవే కాదు.. ఎవరి తరం కాద’ని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్రెడ్డి మాటలకు ఘాటైన విమర్శలు చేశారు. రూ.300ల కోట్లతో పీసీపీ పదవిని కొనుక్కొని, ఇప్పుడు సీట్ల అమ్మకం వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు.. ప్రస్తుతం సీటుకు నోటు అన్నట్లుగా రేవంత్ వ్యవహారం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి సొంత కారుపై తానే రాళ్లు కురిపించుకొని ప్రజలను నమ్మించి మోసం చేసి సానుభూతి ఓటర్లతో గెలిచినట్లు తెలిపారు. రెండోసారి గుర్నాథ్రెడ్డి, విఠల్రావుల మధ్య పోటీతో మూడో వ్యక్తిగా బయటపడటం జరిగిందన్నారు. రెండు పర్యాయాలు గెలిచిన దాంట్లో రేవంత్రెడ్డి ప్రాబల్యం ఏమీ లేదన్నారు.
ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్కు పరిమితమై భూకబ్జాలు, బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడినట్లు ఆరోపించారు. కొడంగల్ అభివృద్ధి తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి చేస్తే కొడంగల్ ప్రజలు 2018లో ఎందుకు ఓటమిపాలు చేశారో ఓమారు తననుతాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. సీట్లను అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నట్లు సొంత పార్టీ సీనియర్ నాయకులే ఆరోపిస్తున్నట్లు పేర్కొన్నారు. నమ్మినవారికి సీట్లు కేటాయించకుండా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి సీట్లు కేటాయించడంతో సీనియర్ నాయకులు రేవంత్ను ఛీకొడుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ ఎక్కడ కాలు పెడితే అక్కడ క్షామం కోరలు చాస్తుందని, పార్టీల భూస్థాపితం ఆయన చరిత్రగా పేర్కొన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా 2018నాటి పరాభవం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని అంబేద్కర్ కూడలిలో శపథం చేసిన విషయాన్ని రేవంత్ మర్చిపోయాడని ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ దత్తతతో రూ.5, 6 వందల కోట్ల నిధులతో అభివృద్ధి జరిగినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని రోడ్డు ఎరుగని ఎన్నో గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు ఏర్పడిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, 3 కొత్తగా మండలాలు ఏర్పడి ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువైనట్లు పేర్కొన్నారు. రెండు మున్సిపాలిటీలకు రూ.200కోట్ల నిధుల మంజూరుతో అభివృద్ధి జరిగినట్లు తెలిపారు. గడిచిన 4 సంవత్సరాల్లో వందల కోట్ల నిధులతో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడటమే కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకు పాటుపడి ప్రజాభిమానాన్ని దక్కించుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి పాల్గొన్నారు.