కొడంగల్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు 2022-23 విద్యా సంవత్సర ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మార్చిలో 10వ తరగతి పరీక్షలు హాజరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, హెచ్సీ, క్రిష్టియన్, ఓసీ బాలబాలికలు ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్ఈఈటీ, సీఎల్ఏటీ, ఎసీఎంఏ మొదలకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని, 20-02-2022 రోజున ప్రవేశపరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. కొడంగల్ నియోజవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.