కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల లబ్ధిదారులకు ఎల్వోసీ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తూ వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొడంగల్ మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన అశ్వినికి రూ. 2లక్షలు, దౌల్తాబాద్ మండలంలోని ఇండాపూర్, ఊరకుంట గ్రామానికి చెందిన కృష్ణయ్యకు రూ. 1 లక్ష ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పత్రాలను అందించారు. కార్యక్రమంలో కొడంగల్, దౌల్తాబాద్ మండలాల టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.