బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిదేండ్ల క్రితం ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఉన్న విషయం విదితమే. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచారు. తరువాత రూ.10 లక్షలకు పెంచడం జరిగింది. తాజాగా మ్యానిఫెస్టోలో ఈ పరిధిని రూ.15 లక్షలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకపక్క ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం, హైదరాబాద్కు అన్ని వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రానుండడంతో వైద్యరంగంలో అనేక అద్భుతాలు చోటుచేసుకోబోతున్నాయని బీఆర్ఎస్ పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు. ‘మళ్లీ బీఆర్ఎస్నే గెలిపిస్తామని.. కేసీఆరే మా సీఎం’ అని జనం నినదిస్తున్నారు..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టో విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గత పదేండ్లలో ఏం చేశారో చెప్పారు. అలాగే వచ్చే ఐదేండ్లలో ఏం చేస్తారో… ఎంత చేస్తారో క్లారిటీ ఇచ్చారు. గతంలో నెరవేర్చిన హామీలు, అమలు చేస్తున్న కొత్త పథకాలు, ప్రస్తుతం ఇచ్చిన హామీలను కలిపి వచ్చే ఐదేండ్లలో అమలు చేసే సామర్థ్యం బీఆర్ఎస్కు మాత్రమేనని వివరించా రు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షల కు పెంచుతామని హామీ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణా మం. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎన్నికల హామీల దిశగా కాకుండా పేద బడుగు బలహీనవర్గాల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే దిశగా ఉన్నదని చెప్పాలి. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై అందరూ సంతోషాన్ని వెలిబుచ్చారు. పేదల బాధలు తెలిసిన నాయకుడే మనకు కావాలని కోరారు. తెలంగాణలో పదేండ్లుగా సుస్థిర ప్రభుత్వాన్ని నిర్మించుకుని రాజకీయ సాధికారత, ఆర్థిక స్వావలంబనతో ముందుకు సాగుతూ సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న బీఆర్ఎస్ విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల మెప్పు పొందుతున్నదని చెప్పారు. స్వీయ పాలనలో సంస్కరణలు చేపట్టి అన్ని వర్గాలకు విధానాల రూపంలో లబ్ధి చేస్తున్న తీరును సీఎం కేసీఆర్ మరోసారి వివరించిన తీరు అద్భుతమన్నారు. ఒక పార్టీ నాయకుడు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు, తన ప్రజలకు కావాల్సిన అవసరాలు, హామీలను వివరించారని పేర్కొన్నారు. విజయవంతమైన గత హామీలనే ఈ సారి మరింత పెంచుతూ ఆర్థిక భరోసా ఇచ్చిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పెంపుతో ఇంటిల్లిపాదికి ఆరోగ్య భద్రత కలుగుతున్నది. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెంచడం శుభ పరిణామం. అన్ని వర్గాల సంక్షేమమే ధ్వేయంగా పనిచేసే ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుంది. ప్రజలకు సేవలు అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో అమలు ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఇండ్లలో వెలుగులు నిండుతాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్కు మాత్రమే ఉంది. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారు.
ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.15లక్షలకు పెంచి సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య భద్రత ఎంతో అవసరం. ఈ పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడిన వారవుతారు. అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం విలువ తెలుస్తుంది. పేదల బాధలు తెలిసిన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఎంతో మేలు చేస్తున్నది. పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ వెంటే ప్రజలు ఎల్లప్పుడు ఉంటారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఉ న్న ఆరోగ్యశ్రీ బీమా గరిష్ట పరిమి తిని రూ.15 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణా మం. అర్హులందరికీ ఈ పథకం వ ర్తింపజేయడం హర్షణీయం. ఉమ్మడి పాలనలో పేదలను పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం సీఎం కేసీఆర్కు ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరి వాడు. అన్ని వర్గాల సంక్షే మానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇది పేదల ప్రభుత్వం. సీఎం కేసీఆర్ కూడా పేద పక్షపాతి. పేదలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అలాగే వాటిని అమలు చేసేందుకు ఎంతో శ్రద్ధ తీసుకొంటున్నారు. ఇలాంటి నాయకుడు మనకు ఉండడం ఎంతో సంతోషం. మరోసారి సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకొనే బాధ్యత మనందరిపై ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మరిన్ని పథ కాలను ప్రవేశపెడతారు. మన పల్లెలను మరింత అభివృద్ధి చేసుకుందాం. అందరికీ కేసీఆర్పై నమ్మకం ఉంది. మరోసారి ఆశీర్వదించండి.
నిరుపేదల పక్షపాతి సీఎం కేసీఆర్. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప థకాల రూపకల్పన చేస్తున్నారు. ఆరో గ్య శ్రీ పథకం గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచడం శుభ పరి ణామం. వైద్యం కోసం ప్రైవేటు దవాఖానకు పోతే లక్షల రూపాయలు గుంజుతున్నారు. అకస్మాత్తుగా ఏదైన రోగం వస్తే ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే భయపడాల్సి వస్తున్నది. కుటుంబానికి రూ. 15లక్షలు వరకు ఉచిత వైద్యం అందించేలా కేసీఆర్ రూపకల్పన చేయడం గొప్ప నిర్ణయం.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యా నిఫెస్టోలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతో ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం లభిస్తుం ది. చిన్నపాటి అనారోగ్యానికి గురయితే ఉచిత వైద్యం, మందు లు ఇస్తున్నారు. తీవ్ర అనారో గ్యానికి గురయితే ప్రైవేటు దవాఖానాల్లో లక్షల కట్టాల్సి వస్తున్నది. ప్రసుత్తం ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకంతో గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచడం గొప్ప నిర్ణయం. పేదలకు ఎంతో చేస్తున్న సీఎం కేసీఆర్ సారు వెంటే నా ప్రయాణం.
రాష్ట్రంలోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచడం మంచి పరిణామం. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టి ప్రకటించడం సంతో షంగా ఉన్నది. రాష్ట్ర ప్రజల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను అందు బాటులోకి తెస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు వరంగా మారుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత పథకాలు ప్రవేశపెట్టి ప్రజా ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రలో పదిలంగా ఉంటాయి. బంగారు తెలంగాణకు అనునిత్యం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
నేటి రోజుల్లో వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్నది. జ్వరం వచ్చినా వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అత్యవసర పరిస్థితులు వస్తే డబ్బులు లేక ఎలా ప్రాణాలను కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో అర్హులైన పేదలకు రూ.15లక్షల వైద్య సేవలకు భరోసా కల్పించడం హర్షణీయం. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఏ పార్టీలు, ప్రభుత్వాలు భరోసా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి కావడంతో పేదలకు ఆమోదయోగ్యమైన, అన్నింటా ఉపయోగకరమైన పథకాలను అందించి ఆదుకొంటున్నారు. ఇలాంటి సీఎంను మనం వదులు కోకుండా ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించుకొందాం. రానున్న రోజుల్లో మరింతగా అభ్యున్నతి సాధించేలా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుదాం. కారు గుర్తుకే ఓటు వేద్దాం.
ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా రోగం వస్తే భయం వేస్తున్నది. దవాఖానకు వెళ్తే ఎన్ని డబ్బులు అవుతాయో ఎక్కడ నుంచి తీసుకురావాలో అని భయమేస్తున్నది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పడు వైద్యం చేసుకునే వెసులుబాటు ఉన్నది. ఇప్పుడు మళ్లీ సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.15లక్షల వరకు పెంచి అందిస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. పేద ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఉంటేనే మనకు అన్ని సదుపాయాలు కలుగుతాయి. బీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నది. అలాగే చెప్పని ఎన్నో పథకాలను అందించి పేద ప్రజలకు అండగా నిలుసున్నది. ఇలాంటి పార్టీని ఆదరిద్దాం.. మన భవిష్యత్తును బంగారు మయం చేసుకుందాం. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇద్దాం.
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచడం చాలా సంతోషం. ప్రజలకు ఎలాంటి పథకాలు అవసరమో సీఎం కేసీఆర్కే తెలుసు. పథకాలను అమలు చేయడం తో పాటు అర్హులందరికీ అందేలా చూస్తున్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుందాం.
తెలంగాణలో పేదలందరూ ఆరోగ్యంగా ఉండా లని సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచడం హర్షణీయం. ఎన్నికల తర్వా త మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అ మలు చేస్తామని హామీ ఇవ్వడం శుభ పరిణా మం. దీంతో ప్రజలకు సర్కారుపై మరింత భరోసా ఏర్పడింది. మన బతుకులు మరింత బాగుపడాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలి.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచడం తో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం అభినందనీయం. సీఎం కేసీఆర్కు పేదల బాధలు తెలుసు. ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్నదే కేసీఆర్ లక్ష్యం. దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు లభించేలా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి పాలన లో పేదలను అసలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో నేను బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తా.
బీఆర్ఎస్ పార్టీ అరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచుతామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నది. ఈ పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నది. ఇప్పుడు ఈ పథకం ద్వారా పరిమితిని పెంచడం హర్షణీయం. మళ్లీ అధికారంలోకి రాగానే పరిమితిని రూ.15లక్షల వరకు పెంచుతామని హామీ ఇవ్వడం శుభ పరిణామం. పేదలు అధిక శాతం ఆరోగ్యశ్రీ కార్డునే ఉపయోగి స్తుంటారు. దీంతో వారికి ఎంతో మేలు జరుగుతుంది.
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన రూ.15లక్షల ఆరోగ్య బీమా సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేడు ప్ర పంచంలో ప్రతి మనిషికి ఏదో రకమైన జ బ్బు తప్పనిసరిగా వస్తుంది. మనం సంపా దించిన దానిలో సగం ఆరోగ్యానికే ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇవన్నీ గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతి కు టుంబానికి కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా రూ.15 లక్షల బీమా వర్తింపజేయడం నిజంగా మన అదృష్టం. ఇలాంటి పథకాన్ని తేవాలంటే ఎంతో ధైర్యం కావాలి. సీఎం చేస్తున్న కృషిని మన మందరం గుర్తించాలి. మరోసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను సీఎంగా చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అండ కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆరోగ్యరక్ష పథకం ద్వారా రూ.15లక్షల బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం సంతో షంగా ఉన్నది. ప్రజల కోసం ఇంతగా అలోచన చేసి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రజలకు లబ్ధి చేకూరే పథకాలు రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుంది. సీఎం కేసీఆర్ చెప్పిన మ్యానిఫెస్టోను అమలు చేస్తారనే నమ్మకం ప్రజలకు వందకు వంద శాతం ఉంది. ప్రజా సంక్షేమ పథ కాలను అమలు చేసే సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించుకుందాం. అందరూ కారు గుర్తుకే ఓటు వేయండి.