షాబాద్, మే 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. సోమవారం జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా 10,678 మందికి కంటి పరీక్షలు నిర్వహించా రు. అందులో 311 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 357 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 4881 మందికి..
బొంరాస్పేట, మే 29 : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డు ల్లో నిర్వహించే శిబిరాలకు ప్రజలు అధికంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చు క్కల మందుతోపాటు విటమిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. కాగా సోమవారం జిల్లాలో 4,881 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 504 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 856 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాలను వైద్యులు ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 566 గ్రామా లు, 111 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.