పరిగి, జనవరి 4 : పరిగి పట్టణ శివారులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇస్తేమా జరుగనున్నది. ఈ కార్యక్రమ నిర్వహణకు పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్ సమీపంలో 280 ఎకరాల్లో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్తేమాకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ముస్లింలు హాజరు కానున్న ట్లు సమాచారం. కార్యక్రమానికి వచ్చిన వారు కూర్చునేందుకు కు ర్చీలతోపాటు భోజన వసతి కోసం 26 వంటశాలను ఏర్పాటు చేస్తున్నా రు.
మంచినీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా మిషన్ భగీరథ పైపులైన్ను జాఫర్పల్లి డబ్ల్యూటీపీ నుంచి కార్యక్రమ నిర్వహణ స్థలానికి ఏర్పాటు చేశారు. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ కేం ద్రాల ఏర్పాటుతోపాటు మరుగుదొడ్లు, ఆరు ప్రత్యేక వైద్య శిబిరాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం ఇస్తేమా ప్రారంభమై 8వ తేదీ సోమవారం సాయంత్రం ముగియనున్నది. ఈ కార్యక్రమం కోసం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పర్యవేక్షణలో సుమా రు 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
ఇందులో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, పదిమంది సీఐలు, 30 మంది ఎస్ఐలు ఉండనున్నారు. కాగా ఇస్తేమా కార్యక్రమ నిర్వహణ, సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. మంచినీటికి సంబంధించి సంపు నిర్మాణం, ఇతర పనుల కో సం రూ.85లక్షలు, పైపులైన్ నిర్మాణానికి రూ.68 లక్షలు, రోడ్డు నిర్మా ణం, పార్కింగ్ ఏర్పా టు కోసం రూ.40 లక్షలు, నిరంతర విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఇతర పనులకోసం రూ.48.35లక్షలు, ఇతర పనులకోసం రూ.4.58 లక్షలు మంజూరయ్యాయి.
పరిగి పట్టణ శివారులో ఈనెల 6వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్న ఇస్తేమా ఏర్పాట్లను గురువారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ జి. రంజిత్రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇస్తేమాకు ఎంతమంది హాజరవుతారు.. వారికి భోజనం, మంచినీరు, ఇతర వసతుల కల్పనపై కమిటీ వారిని ఎంపీ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంచినీటి సరఫరా కు ఏర్పాటుచేసిన సంపు, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు మాజీ సభ్యుడు వాహిద్ అహ్మద్ , మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్మహమూద్అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, వెంకటయ్య, భాస్కర్, కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.