జిల్లావాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. జిల్లాకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా పూర్తై ఏడాదిలోగా జిల్లాకు సాగునీరు వస్తుందనుకున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినైట్లెంది. ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదటి నుంచీ కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రసుత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించ లేదు. మరోవైపు జిల్లాకు సాగునీరందించే ప్రాజెక్టును పక్కన బెట్టి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుకురావడం గమనార్హం. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి కేవలం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారు తప్పా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగునీరందించే అంశాలపై ఎలాంటి ఆలోచన చేయకపోవడం శోచనీయం.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరి స్తున్న తీరుతో జిల్లాకు సాగునీరందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015లోనే పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాప న చేయగా ఏపీతోపాటు కాంగ్రెస్ నేతలు కేసులు వేయడంతో ఆ పనులు నిలిచిపోయాయి. రెం డేండ్ల క్రితం తాగునీటికి సంబంధించిన పనులు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతులివ్వగా.. సాగు నీటి పనులు చేపట్టకుండా గ్రీన్ట్రిబ్యునల్లో వేసిన కేసును పరిశీలించిన ట్రిబ్యునల్ ఏడాది కింద పచ్చజెండా ఊపడంతో పనులు ముమ్మరంగా జరిగాయి. దాదాపుగా 80 శాతం వరకు పూరయ్యాయి. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయా యి.
ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు దాదాపుగా అధిక శాతం వరకు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు నార్లాపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్న్రు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని బీడులు బారిన భూములకు సాగునీరందించి ప్రజల ఏండ్ల కలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘పాలమూరు-రంగారెడ్డి’ పనులను చేపట్టి రూ. వేల కోట్లను ఖర్చు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాగా, కేవలం సాగునీరందించేందుకు కాల్వల పనులు చేయాల్సి ఉన్నది.
ఇందుకు అవసరమైన నిధులనూ బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదిలోగా సాగు నీరొస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నిరాశే మిగిలింది. జిల్లాకు ఉద్దండాపూర్ రిజ ర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా ప్లాన్ చేశారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తైతే జిల్లాలోని సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు 566 గ్రామ పంచాయతీల్లోని 910 హ్యాబిటేషన్లకు తాగునీరందించేలా ప్లాన్ రూపొందించారు. గత ప్రభుత్వం కాల్వల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1000 చెరువులను నింపేందుకు ప్రణాళికను రూపొందించింది.
పాలమూరు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం బాధాకరం. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను అవమానపర్చేలా కేటాయింపులు ఉన్నాయి. 40శాతం ఉన్న కార్మి కులు, కనీస వేతనాల అమలుకు, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్కు సంబంధించి ప్రస్తావిం చలేదు. ఉద్యమకారులకు ఇండ్ల స్థలాల విషయాన్నీ చెప్పలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
– భూమొల్ల కృష్ణయ్య, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
పాలమూరు ప్రాజెక్టుపై కనీస ప్రస్తావన తీసుకురాలేదు. బడ్జెట్ అంకెల గారడీలా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. రైతులను దగా చేసింది. డిసెంబర్ 9న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు.. ఫిబ్రవరి 9వ తేదీ కూడా దాటిపోయింది. రూ.2లక్షల పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమని తేల్చిన పాలకులు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం బాధాకరం. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు.. అందుకు రూ.15 వేల కోట్లు అవసరమని చెప్పి నిధులను కేటాయించలేదు.
– మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే