ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 22 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చిందంటే క్రికెట్ను ఆస్వాదించే ప్రియులకు పండుగే. క్రికెట్ను గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీక్షిస్తున్నారు. బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. రెం డు జట్ల మధ్య జరిగే ఆట కాస్త జూదంలా మా రిపోయింది. విలువైన వస్తువులను తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్లు కాస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్లు చాపకింద నీరులా పట్టణాలు, గ్రా మీణ ప్రాంతాలకు పాకింది. ఏ వీధిలో చూసి నా ఐపీఎల్ బెట్టింగ్ల జోరు పెరిగిపోతున్నది. బెట్టింగ్లు కాస్తూ మ్యాచ్ను తిలకిస్తూ మద్యం తాగడం ఒక వ్యసనంలా మారుతున్నది. చాలామంది టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ కాస్తూ అప్పుల పాలవుతున్నారు.
ఐపీఎల్ ప్రారంభ దశలో సామాజిక మాధ్యమాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో యువత బెట్టింగ్ల జోలికి వెళ్లలేదు. గత ఐదేండ్లుగా ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు విస్తృతంగా చేరువలోకి రావడంతో బెట్టింగ్ల హవా మొదలైంది. పదిమందిని కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఎవరికీ అనుమానం రాకుండా బెట్టింగ్లు కాస్తూ యువత అప్పుల పాలవుతున్నది
నూతన అంశాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ గూగుల్ను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ యాప్ల్లో సైతం యువకులు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్నారు. యాప్లో ప్రత్యేకంగా ఐడీని క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచే జట్టులోని ఆటగాళ్లను బట్టి యాప్ నిర్వాహకులు పాయింట్లను ప్రకటిస్తారు. టీం పాయింట్లను బట్టి కొంతమంది యువకులు పందేలు కాస్తున్నారు. యువత తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి మరీ పందెం కాస్తున్నారు. మొదట్లో కొంచెం లాభం రాగానే వడ్డీ ఎంతైనా అప్పు చేస్తున్నా రు. తీరా డబ్బులు పోగొట్టుకున్నాక అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో డబ్బుల ను పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, మనీ ట్రాన్స్ఫర్ వంటి యాప్ల ద్వారా అకౌంట్లకు పంపుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లు ప్రదానంగా యువతను టార్గెట్ చేస్తున్నారు.
బెట్టింగ్లు యువత పాలిట జూదంలా మారాయి. బెట్టింగ్ కాసే దగ్గర వ్యక్తులు లేకున్నా ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే చాలు.. ప్రధాన జట్లకు ఒక రేటు, మామూలు జట్లకు మారో రేటును బెట్టింగ్ రాయుళ్లు ఫిక్స్ చేస్తారు. ప్రధాన టీంలో ప్రతి ఓవరుకు లేదా ప్రతి బ్యాట్మెన్ సాధించే పరుగులపై.. ప్రతి బౌలర్ తీసే వికెట్లపై ఒక్కో రేటును ఫిక్స్ చేసి యువత బెట్టింగ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. మొదటి రెండు రోజులపాటు సరదాగా మొదలై ఆ తర్వాత వ్యసనంగా మారుతున్న ది. ప్రతి ఏడాది ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా యువత బెట్టింగ్లు కాసేలా చేస్తున్నది.
ఐపీఎల్ బెట్టింగ్లను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులు, యువకులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని పోలీసులు సూచిస్తున్నారు. మ్యాచ్లు జరుగుతున్న సమయంలో పిల్లలు టెన్షన్గా ఉండటం, సెల్ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లను అధికంగా వినియోగిస్తున్నరా..? లేదా అని ఆరా తీయాలి. అదే విధంగా మనీ ట్రాన్స్ఫర్లపై దృష్టి పెట్టాలి. దీని వల్ల బెట్టింగ్ ఊబి నుంచి బయట పడటానికి అధిక అవకాశాలుంటాయంటున్నారు.
బెట్టింగ్లో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. మా రికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. యువత సన్మార్గంలో నడవాలి. ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు . తల్లిదండ్రులు చెప్పినట్లు విని భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలి.
-ఉమామహేశ్వర్రావు, ఏసీపీ ఇబ్రహీంపట్నం