రంగారెడ్డి, జనవరి 20, (నమస్తే తెలంగాణ): జిల్లా రైతులు యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 2,94,972 మంది రైతులకు రూ.345 కోట్ల రైతుబంధు సాయం అందడంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఏడాదికి రెండు విడుతలుగా విత్తనాలు, ఎరువు ల కొనుగోలు నిమిత్తం ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున రూ.పది వేల పెట్టుబడి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంపై సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. ఈ పథకంతో రైతుల అప్పుల కష్టాలు తీరడంతోపాటు రూ పాయి అప్పులేకుండా పంటలను సాగు చేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నారు.
యాసంగిలో రూ. 345.33 కోట్ల సాయం..
రంగారెడ్డి జిల్లాలోని 2,94,972 మంది రైతులకు యాసంగి సీజన్లో రూ.345.33 కోట్ల రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గత నాలుగేండ్లలో ఇప్పటివరకు రైతుబంధు కింద రూ. 2,310 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అం దజేసింది. యాసంగి సీజన్లో ఆయా మండలాల్లోని రైతులకు జమఅయిన పెట్టుబడి సాయం వివరాలు ఇలా.. చేవెళ్లలో రూ.22.34 కోట్లు, మొయినాబాద్లో రూ.12.06 కోట్లు, షాబాద్లో రూ.22.20 కోట్లు, శంకర్పల్లిలో రూ.15.83 కోట్లు, అబ్దుల్లాపూర్మెట్లో రూ.8.20 కోట్లు, ఇబ్రహీంపట్నంలో రూ.17.88 కోట్లు, మాడ్గులలో రూ. 28.39 కోట్లు, మంచాలలో రూ.16.41 కోట్లు, యాచారంలో రూ.19.77 కోట్లు, అమన్గల్లులో రూ.11.62 కోట్లు, బాలాపూర్లో 1.96 కోట్లు, కడ్తాల్లో రూ.14.30 కోట్లు, మహేశ్వరంలో రూ.14.80 కోట్లు, గండిపేటలో రూ. 85.56 లక్షలు, రాజేంద్రనగర్లో రూ.10.28 లక్షలు, శంషాబాద్లో రూ.8.08 కోట్లు, ఫరూఖ్నగర్లో రూ.20.78 కోట్లు, చౌదరిగూడెంలో రూ. 11.33 కోట్లు, కేశంపేట్లో రూ.20.90 కోట్లు, కొందుర్గులో రూ.12.48 కోట్లు, కొత్తూరులో రూ.5.88 కోట్లు, నందిగామలో రూ. 8.32 కోట్లు, తలకొండపల్లిలో రూ.8.32 కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేసింది.
కాగా 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలంలో 2,30,155 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగిలో 1,87,804 మంది రైతులకు రూ.182 కోట్లు, 2020 వానకాలంలో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్లు, 2021 వానకాలంలో 2,82,094 మంది రైతులకుగాను రూ.343 కోట్ల, యాసంగి సీజన్లో 345.33 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
2,38,257 మంది రైతులకు రూ.305 కోట్లు
పరిగి, జనవరి 20: వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగి సీజన్కు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయంగా 2,38,257 మంది రైతులకు రూ.305,01,89,549 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రెండు విడుతలు గా విత్తనాలు, ఎరువుల కొనుగోలు నిమిత్తం ఎకరానికి రూ.ఐదు వేల చొప్పున రూ. పది వేలను అందిస్తున్నది. ఈ యాసంగికి సంబంధించి డిసెంబర్ 28వ తేదీ నుంచి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. మొదటి రోజు ఒక గుంట నుంచి ఎక రం లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయగా…గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 2,38,257 మంది రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలు స్తూ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. గతంలో కరెంటు కష్టాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎండల్లో, వానల్లో నిలబడాల్సి వచ్చే ది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. గతంలో వడ్డీ వ్యాపారులే విత్తనాలు, ఎరువులు ఇచ్చి పంటలు పండిన తర్వాత వడ్డీతో సహా వసూ లు చేసుకునే వారు. పెట్టుబడికి తమ దగ్గరే డబ్బులు ఉంటుండటంతో తమకు నచ్చిన కంపెనీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలను సాగు చేసుకుంటున్నట్లు రైతులు ఆనందంగా చెబుతున్నారు.