పూడూరు : పరిశ్రమల యజమానులు కాలుష్యం లేకుండా పరిశ్రమలను కొనసాగించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల పరిధిలోని సావిత్ర ఐరన్, స్టీల్ ఫ్లాంట్ విస్తీర్ణం పెంచడం వల్ల స్థానిక ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అనంతరం పూడూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద హరితహారం ద్వారా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమన్ గుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు ప్రక్కనే ఉన్న ఐరన్, స్టీల్ పరిశ్రమ ప్లాంట్ విస్తీర్ణం పెంచడంతో స్థానికులకు ఎమైన సమస్యల కలుగుతాయ అని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల ఇండస్ట్రీయల్ ఫార్కులో 150ఎకరాల్లో ఐరన్, స్టీల్ పరిశ్రమల నిర్మాణాలు జరిగేలా భూ కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ హరితహారం ద్వారా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలను నాటడంతో భావితరాల పిల్లలకు మంచి గాలినందించిన వామవుతామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంద న్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఆర్ఐ బాల్రాజ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.