పరిగి, ఫిబ్రవరి 2: డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఉన్నత విద్యా శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. గురువారం ఆయన పరిగిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మికం గా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఇష్టపడి చదివి సెమిస్టర్ పరీక్షలతోపాటు టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, టీటీసీ, బీఈడీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నా రు.
కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, అధ్యాపకులు భాస్కరయోగి, సాయినాథ్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు విల్సన్, జనార్దన్, ప్రవీణ్, ఆంజనేయులు, శ్రీనివాస్, సాయిలప్ప, విజయలక్ష్మి, అంజమ్మ, నర్సిం హులు, శంకరయ్య పాల్గొన్నారు.