కందుకూరు, ఆగస్టు 12 : నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కందుకూరు మండలం మాలగూడూరులో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నదని చెప్పారు. సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. అందులో భాగంగానే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.