మర్పల్లి, నవంబర్ 15 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనంద్కు మద్దతుగా మంత్రి కేటీఆర్ గురువారం మర్పల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నట్లు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ మధుకర్, చీమలదరి సర్పంచ్ నర్సింహారెడ్డి తెలిపారు.
బుధవారం మర్పల్లిలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను దగ్గరుండి పూర్తి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మధుకర్, టౌన్ ప్రెసిడెంట్ గఫార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్, నాయకులు శ్రీకాంత్, జైపాల్రెడ్డి, హుస్సేన్, సురేందర్, శ్రీకాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.