షాద్నగర్రూరల్, అక్టోబర్ 30: కర్ణాటకలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేసినందుకు ఆ రాష్ట్రం అంధకారంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు వేస్తే అంధకారం తప్పదని, అభివృద్ధి కావాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫరూఖ్నగర్ మండలం హాజీపల్లి, కిషన్నగర్, చించోడ్, అయ్యవారిపల్లి, దేవునిపల్లి, మొండోనిరాయితండా, చౌలపల్లి, ఉప్పరిగడ్డ గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పాలన్నారు. కేవలం తొమ్మిదన్నర ఏండ్లలో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధించాలంటే తనను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గ్రామాల్లో వృద్ధులు కనిపిస్తే వారి వద్దకు వెళ్లి ఏం పెద్దయాన నీకు పెన్షన్ వస్తుందా అని ఆప్యాయంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పలకరించారు. ప్రతి నెలా పెన్షన్ వస్తుందని, తమకు ఆదెరువుగా సీఎం కేసీఆర్ నిలబడటం చాలా సంతోషంగా ఉందని, ఎవరు ఎన్ని చెప్పినా మేము మాత్రం కారుగుర్తుకు ఓటు వేస్తామని వృద్ధులు చెప్పుతుండటంతో నాయకులలో సంతోషం నెలకొంది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు మౌనిక, శ్రీశైలంయాదవ్, బాలమణి, లక్ష్మి, రాఘవేందర్, సుగుణ, రుక్సానాబేగం, సుమిత, సాయిప్రసాద్, ఎంపీటీసీ శివరాజ్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, రాయికల్ వెంకట్రెడ్డి, కట్ట వెంకటేశ్గౌడ్, బాలు, బక్కనయాదవ్, లింగం, రాఘవేందర్, నవాజ్, ఆశన్న పాల్గొన్నారు.
శంకర్పల్లి, అక్టోబర్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల, గోపులారం, మహారాజ్పేట్, దొంతాన్పల్లి, మిర్జాగూడ, ఇంద్రారెడ్డి నగర్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని దోచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటీపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ కష్టాలు మళ్లీ మొదటికి వస్తాయని గుర్తు చేశారు.
ప్రతి కార్యకర్త సైనికుని వలే పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజూనాయక్, ఏఎంసీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, సర్పంచ్లు రవీందర్గౌడ్, సత్యనారాయణరెడ్డి, పొడువు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, అశ్విని సుధాకర్, నాయకులు గోవర్ధన్రెడ్డి, కాంత్రెడ్డి, అంజయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : రాష్ట్ర ప్రజల క్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలువాలని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 27వ వార్డులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమ పథకాలను వార్డులోని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందని గడప లేదన్నారు. షాద్నగర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జూపల్లి కౌసల్య, కానుగు అంతయ్య, జీ.టీ శ్రీనివాస్, నాయకులు జూపల్లి శంకర్, యుగేందర్, సుధాకర్, యాదగిరి, నందకిశోర్, శేఖర్, నర్సింహులు, రాఘవేందర్రెడ్డి, రమేశ్, దిలీప్, శరత్కృష్ణ, రాఘవేందర్, పిన్నమోని గోపాల్, భాస్కర్, అశోక్, సుమధీర్ పాల్గొన్నారు.
నందిగామ : రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అంతిరెడ్డిగూడ గ్రామాల్లో సర్పంచ్ వెంకట్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు.
కొత్తూరు : మున్సిపాలిటీ, మండలంలో నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో 4,5,6,7 వార్డుల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్ ఆధ్వర్యంలో కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కొత్తూరు మండలంలోని గూడూరులో సర్పంచ్ బ్యాగరి సత్తయ్య ఆధ్వర్యంలో, మల్లాపూర్ తండాలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాసులు, నాయకులు గుండు సురేశ్, లోబ్యానాయక్, పీర్యానాయక్, గోవింద్రెడ్డి, భాస్కర్రెడ్డి, రవినాయక్, శ్రవణ్, వెంకటేశ్, జోగు బాల్రాజు, లక్ష్మయ్య, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.