ఇబ్రహీంపట్నం : ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిబట్ల టీఆర్ఎస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టపర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లేలా కృషి చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి పట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.
ఆదిబట్ల మున్సిపాలిటి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొప్పు జంగయ్య, ఉపాధ్యక్షులుగా పాతూరి రాముగౌడ్, కాకి మహేందర్, గురం సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా కొర శేఖర్, నర్సగల్ల రమేశ్, గూడూరు వెంకటేశ్, సంయుక్త కార్యదర్శిగా విజయ్కుమార్గౌడ్, ప్రచార కార్యదర్శులుగా సుధాకర్గౌడ్, గూదె వెంకటేశ్, భూపతిగల్ల అశోక్, కోశాధికారిగా కొండ్రు జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా ఈశ్వరయ్య, వినోద్కుమార్, ప్రభావతి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.