ఇబ్రహీంపట్నం, జనవరి 22 : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామాలన్నీ రామనామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే గ్రామాల్లోని ఆలయాల్లో రామునికి ప్రత్యేక పూజలతో పాటు భజనలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం ఆలయాల్లో జరిపిన ప్రత్యేక పూజల్లో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని త్రిశక్తి దేవాలయంలో రాముడికి, ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపు నిర్వహించారు.
కడ్తాల్ : మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం, అర్చనలు, హారతులు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో ఎల్ఈడీని ఏర్పాటు చేశారు. భక్తులు రాముడిని స్మరిస్తూ గీతాలు అలపిస్తూ, బతుకమ్మ ఆడారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఎస్ఐ హరిశంకర్గౌడ్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, శేఖర్, మహేశ్, రాజేశ్, భానుకిరణ్, జగదీశ్, తరుణ్, అర్చకులు భానుప్రసాద్, శ్రీమన్నారాయణ, నర్సింహమూర్తి పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : కాషాయ జెండాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. సోమవారం ఉదయం నుంచే దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో దేవాలయాలు మార్మోగాయి. దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని భక్తులు వీక్షించారు.
రామ భక్తులు దేవాలయ ఆవరణలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. షాద్నగర్లోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరం, వేంకటేశ్వరస్వామి, చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి దేవాలయాలతో పాటు ఆయా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వీహెచ్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి రమేశ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందుర్గు, చౌదరిగూడ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లోని శ్రీరాముడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షింతలను పూజల అనంతరం తలపై చల్లుకున్నారు. కేశంపేట మండల కేంద్రంలో సర్పంచ్ వెంకట్రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తూరు మండల కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య, నందిగామ మండలంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శంకర్పల్లి : వివిధ ఆలయాల్లో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. మున్సిపాలిటీలో భారీ సంఖ్యలో యువకులు శోభాయాత్రను చేపట్టారు. కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్, కౌన్సిలర్ శ్వేత, వాణి పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేవెళ్ల శాఖ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి పల్లకిలో స్వామివారిని ఊరేగించారు. హనుమాన్ దేవాలయం ముందు స్క్రీన్ ఏర్పాటు చేశారు.
ఆమనగల్లు : పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు తల్లోజు విజయకృష్ణ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, నాయకులు చెన్నకేశవులు, పాపిశెట్టి రాము, మాధవచారి, యాదగిరి, ప్రభాకర్, అశోక్, విష్ణు, శివశంకర్, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : గ్రామాల్లో శ్రీరాముని చిత్ర పటాలు, ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. అజీజ్నగర్ గ్రామంలో ఉత్సవ విగ్రహంతో డీజే ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో రెండు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. జైశ్రీరాం నినాదాలతో గ్రామాలు మార్మోగాయి.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయం నుంచి చిలుకూరు గ్రామంలోని హనుమాన్ దేవాలయం వరకు మహా పాదయాత్రను ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి ప్రారంభించారు. కళాకారుల డప్పుల దరువు ఆకట్టుకున్నది. మహిళలు బోనాలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ స్వరూప, నాయకులు గోపాల్రెడ్డి, జయవంత్, నర్సింహగౌడ్, చెన్నయ్యయాదవ్, ఆండ్రూ, సుధాకర్రెడ్డి, శ్రీరాములు, మల్లారెడ్డి, రాజు, కిషన్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : ముడిమ్యాల్ గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో పెద్ద స్రీన్లు ఏర్పాటు చేసి భక్తులు తిలకించేందుకు వీలు కల్పించారు. స్వామివారి పల్లకి సేవ నిర్వహించి పూజా కార్యక్రమాల అనంతరం అన్నదానం చేశారు.
షాబాద్, జనవరి 22: ప్రతి ఒక్కరూ శ్రీరాముడి జీవన శైలిని అలవర్చుకోవాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజలో వారు పాల్గొ న్నారు.
అనంతరం దేవాలయ ఆవరణలో భక్తులు శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు బోనాలతో స్వామివారికి మొక్కులు చెల్లిం చుకున్నారు. షాబాద్ మండల కేంద్రంలో శ్రీరాముడి శోభాయాత్ర ఘనం గా నిర్వహించారు. నాగరగూడ నుంచి సీతారాంపూర్ వరకు భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస్, సర్పంచ్లు కొత్త పాండురంగారెడ్డి, సుబ్రహ్మాణ్యేశ్వరి పాల్గొన్నారు.