ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 15 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం బలపరీక్ష జరుగనున్నది. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే విశ్వాస పరీక్షకు చైర్పర్సన్ వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు హాజరవుతారా..? లేదా అనేది సందిగ్ధంగా మారింది. స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 17 మంది కౌన్సిలర్లు ఆమెకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. అయితే అందులోని ఇద్దరు సభ్యులు చైర్పర్సన్వర్గంలో చేరడంతో వ్యతిరేక వర్గంలోని సభ్యుల సంఖ్య ప్రస్తుతం 15కు చేరింది. అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే కచ్చితంగా 17 మంది సభ్యుల మద్దతు అవసరం. అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో నేడు జరుగనున్న బలపరీక్షకు చైర్పర్సన్ వ్యతిరేక వర్గం సభ్యులు హాజరవుతారా..లేదా అనేది తెలియడంలేదు.
కాగా తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయే లా చైర్పర్సన్ కప్పరి స్రవంతి చాకచక్యంగా వ్యవహరించారు. తనకు అనుకూలంగా ఉన్న ఏడుగు రు సభ్యులతోపాటు వ్యతిరేకవర్గం నుం చి వచ్చిన ఇద్దరు, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (ఎక్స్అఫీషియో సభ్యుడు)ఓటుతో కలుపుకొని మొత్తం 10 మందిని కూడగట్టుకున్నారు. వారితో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. బలపరీక్ష గడువు ముగిసేవరకు వారు సమావేశానికి దూరంగా ఉం డాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా..? వీగిపోతుందా అనేది శుక్రవారం తేలనున్నది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు బలపరీక్ష నిర్వహిస్తాం. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే కనీ సం 17మంది సభ్యుల మద్దతు అవసరం. 17 మంది సభ్యులు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే స్రవంతి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సభ్యులు తక్కువగా వస్తే తీర్మానం వీగిపోతుంది. బలపరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
-అనంతరెడ్డి, ఆర్డీవో ఇబ్రహీంపట్నం
వికారాబాద్, ఫిబ్రవరి 15 : జిల్లాలో ఆరుగురు ఎస్ఐలు బదిలీ అయినట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కులకచర్ల పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న శ్రీశైలం బంట్వారం పీఎస్కు.. వికారాబాద్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న అన్వేశ్కుమార్ కులకచర్ల ఠాణాకు వెళ్లగా.. బంట్వారం పీఎస్లో పనిచేస్తున్న ఆనంద్కుమార్ దోమ పీఎస్కు బదిలీ అయ్యారు. దోమ ఠాణాలో పనిచేసే రవి వికారాబాద్ జిల్లా కార్యాలయానికి.. వికారాబాద్ జిల్లా కార్యాలయంలో రిజర్వులో ఉన్న కాశీనాథ్ తాం డూరు పీఎస్కు బదిలీపై వెళ్లగా.. వికారాబాద్ జిల్లా కార్యాలయంలో రిజర్వులో ఉన్న సత్యనారాయణ వికారాబాద్ పీఎస్కు బదిలీ అయినట్లు ఎస్పీ తెలిపారు.
వికారాబాద్ మండలానికి 33 సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లు, ధారూరులో 48 సీసీ రోడ్లకు రూ.2.5 కోట్లు, మోమిన్పేటలో 41సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, మర్పల్లిలో 30 సీసీ రోడ్లకు రూ.2.63 కోట్లు, బంట్వారంలో 30 సీసీ రోడ్లకు రూ.2.85 కోట్లు, కోట్పల్లిలో 24 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, పరిగిలో సీసీ 46 రోడ్లకు రూ.2.20 కోట్లు, పూడూరులో 51 సీసీ రోడ్లకు రూ.2.50 కోట్లు, దోమలో 52 సీసీ రోడ్లకు రూ.2.53 కోట్లు, కులకచర్లలో 44 సీసీరోడ్లకు రూ.2.09 కోట్లు, చౌడాపూర్లో 16 సీసీ రోడ్లకు రూ.73 లక్షలు, తాండూరులో 52 సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, పెద్దేముల్లో 53 సీసీరోడ్లకు రూ.కోటి, యాలాలలో 57 సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, బషీరాబాద్లో 46 సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, బొంరాస్పేటలో 55 సీసీ రోడ్లకు రూ.7.20 కోట్లు, దౌల్తాబాద్లో 36 సీసీరోడ్లకు రూ.6.05 కోట్లు, కొడంగల్ మండలంలో 37 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.6.75 కోట్లు మంజూరయ్యాయి.