యాచారం, ఫిబ్రవరి 18 : బాలగ్రామ్ సేవలు అద్భుతంగా ఉన్నాయ ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండా సమీపంలో ఉన్న బాలగ్రామ్ అనాథాశ్రమ వా ర్షికోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. బాలగ్రామ్ ద్వారా అనాథ పిల్లలు, బాలగ్రామ్ కంటి దవాఖాన ద్వారా పేదలకు అందుతున్న సేవలను నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివ రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతాదృ క్పథంతో అనాథ పిల్లలను చేరదీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ఎంతో అభినందనీయమన్నారు. కంటి దవాఖాన ద్వారా పేదలకు ఉచితంగా పరీక్షలు, కంటి ఆపరేషన్లు చేయడం సంతో షకరమన్నారు. బాలగ్రామ్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బాలగ్రామ్ నిర్వాహకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కానున్నట్లు చైర్పర్సన్ అనురాధ తెలిపారు. కమ్మ గూడ, తుర్కయంజాల్ గ్రామాల్లోని పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారన్నారు.