తలకొండపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తలకొండపల్లి మండలంలోని వీరన్నపల్లిలో మూడు ఇండ్లు కూలిపోయాయి. కూలిపోయిన ఇండ్లను గ్రామ సర్పంచ్ నాగమణి లింగంగౌడ్ శనివారం స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిపోయిన బాధితుల ఇండ్ల వివరాలను మండల అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు బాధితుల ఇండ్ల వివరాలను నమోదు చేసి నష్టపరిహారం అంచనా వేసి ఉన్నత అధికారులకు నివేదిక పంపించామని అన్నారు.