రంగుల పండుగ హోలీని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి గ్రామాలు, పట్టణ ప్రధాన కూడళ్లలో కామదహనం చేశారు. సోమవారం హోలీ జరుపుకున్నారు. యువకులు, పిల్లలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా చిందులేశారు. గ్రామాల్లో లభించే మోదుగ పువ్వులను దంచి చిన్నా రులు రంగులుగా ఉపయోగించారు. చిన్న పిల్లలు వాటర్ బాటిళ్లలో రంగులు నింపుకొని ఉత్సాహంగా హోలీ ఆడారు. డప్పులతో ర్యాలీ గా బయలుదేరి ఇండ్లకు వెళ్లి రంగులు చల్లుకున్నారు.
చిన్నాపెద్దా, స్త్రీ పురుష భేదం లేకుండా పండుగలో పాల్గొన్నారు. తండాలలో లంబాడా మహిళలు, యువకులు ఉత్సాహంగా హోలీ ఆడారు. మహిళలు హోలీ హోలీరే రంగ హోలీ చెమ్మకేలీల హోలీ అంటూ పాడుకుంటూ నృత్యాలు చేశారు. పలు గామాల్లో యువత కోడి గుడ్లు, టమాటలతో పాటు రంగులు వినియోగించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దంపతులు శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హోలీ సంబురాలు జరుపుకొన్నారు.
వికారాబాద్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పరిగి పట్టణంలో జరిగిన హోలీ సంబురాల్లో మున్సి పల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయ కులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు.
-న్యూస్నెట్వర్క్ , నమస్తే తెలంగాణ