కేశంపేట, డిసెంబర్ 9: సమగ్ర వ్యవసాయం తో రైతులకు అధిక లాభాలొస్తాయని జయశంకర్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవి అన్నా రు. శుక్రవారం ఆయన మండలంలోని వేములనర్వ, ఇప్పలపల్లి, ఎక్లాస్ఖాన్పేట గ్రామా ల్లో రైతులకు సమగ్ర వ్యవసాయంపై అవగాహన కల్పించారు.
వరి, మొక్కజొన్న పంటలతోపాటు కూరగాయలు, పూలు, పశుపోషణ, కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలను ఆర్జించాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల రైతులకు కేఎన్ఎం-1638 కొత్త వంగడాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.